బాలిక కేసును పునర్విచారణ చేయాలి: విజయసాయి

ABN , First Publish Date - 2021-10-14T00:45:34+05:30 IST

నగర శివారు శనివాడలో అనుమానాస్పదంగా మృతిచెందిన బాలిక కేసును పునర్విచారణ చేయాల్సిన అవసరం ఉందని

బాలిక కేసును పునర్విచారణ చేయాలి: విజయసాయి

విశాఖపట్నం: నగర శివారు శనివాడలో అనుమానాస్పదంగా మృతిచెందిన బాలిక కేసును పునర్విచారణ చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. బాలిక మృతి చెందిన స్థలాన్ని బుధవారం విజయసాయి పరిశీలించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి బాలిక తల్లిదండ్రుల కథనానికి, పోలీసులు చెబుతున్న దానికి వ్యత్యాసం ఉందన్నారు. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరగలేదని రజక సంఘాలు, మహిళా సంఘాలు తమ దృష్టికి తీసుకువచ్చాయని తెలిపారు. నగర్‌ పోలీస్‌ కమిషనర్‌, ఇతర అధికారులతో మాట్లాడి కేసును పూర్తిస్థాయిలో విచారణ జరిపే విధంగా చర్యలు తీసుకుంటామని  విజయసాయిరెడ్డి చెప్పారు. 

Updated Date - 2021-10-14T00:45:34+05:30 IST