బాలికపై అత్యాచారం చేసి, సిగరెట్లతో కాల్చారు

ABN , First Publish Date - 2020-08-17T18:56:01+05:30 IST

నీళ్ల కోసం బోరు వద్దకు వచ్చిన ఓ బాలికను ఎత్తుకెళ్లి రాత్రంతా ఆమెపై అత్యాచారం చేసి, సిగరెట్లతో కాల్చిన దారుణ ఘటన....

బాలికపై అత్యాచారం చేసి, సిగరెట్లతో కాల్చారు

గోరఖ్‌పూర్ : నీళ్ల కోసం బోరు వద్దకు వచ్చిన ఓ బాలికను ఎత్తుకెళ్లి రాత్రంతా ఆమెపై అత్యాచారం చేసి, సిగరెట్లతో కాల్చిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్ పూర్ జిల్లాలో వెలుగుచూసింది. ఓ బాలిక నీళ్లు తీసుకువచ్చేందుకు హాండ్ పంపు వద్దకు రాగా ఇద్దరు వ్యక్తులు ఆమెను ఎత్తుకెళ్లి పలుసార్లు అత్యాచారం చేసి, శరీరంపై సిగరెట్లతో కాల్చారు. ఇటుకబట్టీల్లో పనిచేసే బాలిక తల్లిదండ్రులు రెండోరోజు ఉదయం తన కుమార్తె తీవ్ర గాయాలతో పడి ఉండటం చూసి ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికపై సామూహిక అత్యాచారం చేసి, శరీరాన్ని సిగరెట్లతో కాల్చారని వైద్యులు నివేదించారు. దీంతో పోలీసులు నిందితులైన అర్జున్, చోటులను అరెస్టు చేసి వారిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. 

Updated Date - 2020-08-17T18:56:01+05:30 IST