పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా గిరిప్రసాద్
ABN , First Publish Date - 2022-01-17T05:42:34+05:30 IST
ప్రొగ్రెసీవ్ రికగ్జైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడిగా చిత్తూరు రూరల్ సీజీపల్లె ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న గిరిప్రసాద్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
చిత్తూరు (సెంట్రల్), జనవరి 16: ప్రొగ్రెసీవ్ రికగ్జైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడిగా చిత్తూరు రూరల్ సీజీపల్లె ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న గిరిప్రసాద్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఆదివారం చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకంలోని ఓ హోటల్లో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రకా్షరెడ్డి అధ్యక్షతన జరిగింది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అనంతపురం జిల్లా గుత్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మల్లు శ్రీధర్రెడ్డి ఎన్నికకాగా, సంఘం పత్రికా సంపాదకుడిగా కృష్ణారెడ్డి, మీడియా సెల్ కన్వీనర్గా రామారావు, సీపీఎస్ రాష్ట్ర కన్వీనర్గా తిరుపాల్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా చిత్తూరు ఎంఈవో సెల్వరాజ్, పరిశీలకులుగా కడప జిల్లా హిమకుంట్ల జడ్పీహెచ్ఎ్స హెచ్ఎం చంద్రారెడ్డి వ్యవహరించారు. ఎన్నికైన వారికి ఎన్నికల అధికారి ధృవీకరణ పత్రాలు అందజేశారు.