గిరిజారాణికి ఉగాది పురస్కారం
ABN , First Publish Date - 2021-04-13T06:03:11+05:30 IST
మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా క్షేత్రం సీనియర్ శాస్త్రవేత్త (ప్లాంట్బ్రీడింగ్) డాక్టర్ గిరిజారాణి ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా క్షేత్రం సీనియర్ శాస్త్రవేత్త (ప్లాంట్బ్రీడింగ్) డాక్టర్ గిరిజారాణి ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్న 8 మందిని ఉగాది పురస్కారాలకు ఎంపిక చేస్తూ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ర్టార్ గిరిధరకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజారాణి మార్టేరులో 11 సంవత్సరాలకుపైగా శాస్త్రవేత్తగా పనిచేశారు. ఏడాదిన్నరగా మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా క్షేత్రం సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. మార్టేరులో పనిచేసిన కాలంలో ఎంటీయూ 1140, ఎంటీయూ 1172, ఎంటీయూ 1190 వరివంగడాలను గిరిజారాణి కనుగొన్నారు. ఎంటీయూ 1156, 1153, 1159,1233, 1210, 1293 వరి వంగడాల పరిశోధనల్లో ఇతర శాస్త్రవేత్తలతో కలిసి పనిచేశారు. ఆచార్య ఎన్రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగే కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.