రూ.2 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

ABN , First Publish Date - 2022-01-24T05:35:34+05:30 IST

హైదరాబాద్‌ నుంచి ఒంగోలు వెళ్తున్న బస్సులో అక్రమంగా తరలిస్తున్న 20వేల గుట్కా ప్యాకెట్లను నాగార్జునసాగర్‌ చెక్‌పోస్టు వద్ద స్వాధీనం చేసుకున్నట్టు మాచర్ల రూరల్‌ సీఐ సురేష్‌బాబు తెలిపారు.

రూ.2 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లతో పోలీసులు

విజయపురిసౌత్‌, జనవరి 23: హైదరాబాద్‌ నుంచి ఒంగోలు వెళ్తున్న బస్సులో అక్రమంగా తరలిస్తున్న 20వేల గుట్కా ప్యాకెట్లను నాగార్జునసాగర్‌ చెక్‌పోస్టు వద్ద స్వాధీనం చేసుకున్నట్టు మాచర్ల రూరల్‌ సీఐ సురేష్‌బాబు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌ ఆర్టీసీ కార్గో సర్వీసులో ఒంగోలు వైపు అక్రమంగా గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేశామన్నారు. పట్టుకున్న గుట్కా విలువ రూ.2లక్షలు ఉంటుందని, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. సమాశేశంలో ఎస్‌ఐలు అనిల్‌కుమారెడ్డి, ఏడుకొండలు, ఏఎస్‌ఐ మస్తాన్‌వలి, కానిస్టేబుళ్లు సుబ్బారావు, ఇర్మియా, అప్పలనాయుడు తదితరులు ఉన్నారు. 

 

Updated Date - 2022-01-24T05:35:34+05:30 IST