డిప్యూటీ మేయర్పై అసత్య ప్రచారం
ABN , First Publish Date - 2020-03-17T14:44:56+05:30 IST
జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని బోరబండ వీకర్సెక్షన్ కాలనీ వాసులు జూబ్లీహిల్స్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. డిప్యూటీ మేయర్ను కొంతమంది కొట్టారంటూ సోషల్ మీడియాలో ఎన్ఎస్యూఐ నాయకుడు స్వామి అసత్య ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బోరబండ వాసులు సత్యనారాయణ తదితరులు కోరారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ ప్రారంభించారు.
సీసీఎస్లో టీఆర్ఎస్వీ ఫిర్యాదు
డిప్యూటీ మేయర్పై కొంతమంది ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారంటూ టీఆర్ఎస్వీ నాయకులు ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ సెంట్రల్ క్రైమ్ పోలీ్సస్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు.