మరో వివాదంలో మేయర్ గద్వాల.. వీడియో వైరల్
ABN , First Publish Date - 2021-03-05T07:03:40+05:30 IST
జీహెచ్ఎంసీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా
- కోడ్ను ఉల్లంఘించిన మేయర్
- సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
హైదరాబాద్ సిటీ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : జీహెచ్ఎంసీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన వారికి మేయర్ టీఆర్ఎస్ కరపత్రాలు పంచిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి తన ఛాంబర్లో టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేయడం ఎన్నికల కోడ్కు విరుద్దమని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల మేయర్ను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంలో ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలంటూ వారికి మేయర్ కరపత్రాలు పంచారు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ కావడంతో మేయర్పై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.