జీహెచ్ఎంసీ హెచ్చరిక..ఇళ్లలోంచి బ‌య‌ట‌కు రావొద్దు

ABN , First Publish Date - 2020-10-20T19:56:27+05:30 IST

జీహెచ్ఎంసీ హెచ్చరిక..ఇళ్లలోంచి బ‌య‌ట‌కు రావొద్దు

జీహెచ్ఎంసీ హెచ్చరిక..ఇళ్లలోంచి బ‌య‌ట‌కు రావొద్దు

హైదరాబాద్: రోడ్లపై నీరు నిల్వకుండా డీఆర్ఎఫ్ బృందాల‌ను అప్రమ‌త్తం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ తెలిపారు. న‌గ‌ర ప్రజ‌లు ఇళ్లలోంచి బ‌య‌ట‌కు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరిక జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల్లో బోట్లను అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. అధికారులు, ఫ్లడ్ రిలీఫ్ స్పెషల్ ఆఫీసర్లు, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తం చేశామని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను రిలీఫ్ సెంటర్లకు తరలించామని పేర్కొన్నారు. రోడ్లపై నీరు నిల్వకుండా డీఆర్ఎఫ్ బృందాల‌ను అప్రమ‌త్తం చేసినట్లు చెప్పారు. 

Updated Date - 2020-10-20T19:56:27+05:30 IST