‘ఘర్ బైటో ఇండియా’ అంటూ పిలుపు ఇచ్చిన క్రికెటర్ మొహమ్మద్ షమీ

ABN , First Publish Date - 2020-03-27T16:37:04+05:30 IST

దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాక్‌డౌన్ ప్రకటనకు ప్రముఖ క్రికెటర్ మొహమ్మద్ షమీ మద్ధతు ప్రకటించారు....

‘ఘర్ బైటో ఇండియా’ అంటూ పిలుపు ఇచ్చిన క్రికెటర్ మొహమ్మద్ షమీ

న్యూఢిల్లీ :దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాక్‌డౌన్ ప్రకటనకు ప్రముఖ క్రికెటర్ మొహమ్మద్ షమీ మద్ధతు ప్రకటించారు. కరోనా కట్టడికి 21 రోజుల లాక్‌డౌన్‌ను పాటించి ఇంట్లోనే ఉండాలనే కేంద్ర ప్రభుత్వ సూచలను పాటించాలని భారత జట్టు క్రికెటర్ మొహమ్మద్ షమీ తన అభిమానులను అభ్యర్థించారు.


‘‘మన భారతదేశం సంక్షోభంలో ఉంది.ఈ ముఖ్యమైన సమయంలో అందరూ ఇంట్లోనే ఉండండి, ఇంట్లో ఉంటున్న ప్రతీ పౌరుడు ఈ దేశానికి హీరో...వైద్యుల సలహా పాటిస్తూ ప్రతీ ఒక్కరూ ఇంట్లోనే ఉండండి, ధన్యవాదాలు’’ అంటూ క్రికెటర్ షమీ ‘ఘర్ బైటో ఇండియా’ శీర్షికన ట్విట్టర్ లో వీడియో సందేశాన్ని పోస్టు చేశారు. ఇంట్లోని గదిలో నుంచి వీడియో సందేశాన్ని షమీ పంపించారు.కరోనా లాక్ డౌన్ పై క్రికెటర్లు విరాట్ కోహ్లీ, అశ్విన్, మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 

Updated Date - 2020-03-27T16:37:04+05:30 IST