ఘంటాఫుడ్స్ కార్మికుల ధర్నా
ABN , First Publish Date - 2020-11-28T05:29:32+05:30 IST
ఘంటాఫుడ్స్ కార్మికుల ధర్నా
యాచారం : వేతనాలు పెంచి ఆదుకోవాలని ఘంటాఫుడ్స్ కంపెనీ కార్మికులు డిమాండ్ చేశారు. మండల పరిధి నందివనపర్తిలోని ఘంటాఫుడ్స్ కార్మికులు శుక్రవారం విధులను బహిష్కరించి కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించారు. రోజుకు కనీన వేతనం రూ.380కి పెంచాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్నామని వేతనాల పెంపు విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని కార్మికులు స్పష్టం చేశారు. పీఎఫ్, ఈఎ్సఐ వర్తింపజేయాలని కోరారు. రెండు రోజుల్లో కార్మికులకు న్యాయం చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని సీఐటీయూ నాయకులు చెప్పారు. ధర్నాలో సీఐటీయూ మండల కార్యదర్శి పి.బ్రహ్మయ్య, నాయకులు పాల్గొన్నారు.