జీజీహెచ్ సూపరింటెండెంట్గా నరేంద్రనాథ్రెడ్డి
ABN , First Publish Date - 2020-12-02T06:25:56+05:30 IST
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ (ఎఫ్ఏసీ) గా మళ్లీ డా.జి.నరేంద్రనాథ్రెడ్డిని నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
- ప్రిన్సిపాల్గా డా. జిక్కి
కర్నూలు(హాస్పిటల్), డిసెంబరు 1: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ (ఎఫ్ఏసీ) గా మళ్లీ డా.జి.నరేంద్రనాథ్రెడ్డిని నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉన్న డా. జిక్కిని కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా బదిలీ చేశారు. ప్రిన్సిపాల్గా ఉన్న డా. పి.చంద్రశేఖర్ను కార్డియాలజీ హెచ్వోడీగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అడ్మినిస్ర్టేటివ్ గ్రౌండ్ కింద ఈ మార్పులు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సరిగ్గా నెల రోజులు తిరగకముందే డా.జిక్కి స్థానంలో కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్గా డా.నరేంద్రనాథ్ రెడ్డిని నియమించడం ఆసుపత్రి వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రిన్సిపల్ సెక్రటరీ జారీ చేసిన జీవోలో కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా.చంద్రశేఖర్ను రివర్షన్ చేసి కార్డియాలజీ హెచ్వోడీగా నియమించారు. ఇది వైద్యవర్గాల్లో చర్చనీయాంశమైంది.