సాధారణ రోగులెవరో.. కరోనా బాధితులెవరో..

ABN , First Publish Date - 2021-04-17T05:15:37+05:30 IST

సాధారణ రోగులెవరో.. కరోనా బాధితులెవరో..

సాధారణ రోగులెవరో.. కరోనా బాధితులెవరో..

జీజీహెచ్‌ ఓపీ విభాగం వద్ద కిటకిట 

విజయవాడ, ఆంధ్రజ్యోతి : కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రికి రోగుల తాకిడి పెరుగుతోంది. ఒక బ్లాక్‌లో కరోనా బాధితులకు, మరో బ్లాక్‌లో సాధారణ రోగులకు వైద్యసేవలందిస్తున్నారు. కొవిడ్‌ బాధితులకు, సాధారణ రోగులకు విడివిడిగా ఓపీ విభాగాలను ఏర్పాటుచేసినా జిల్లావ్యాప్తంగా వస్తున్న రోగులకు ఆ విషయం తెలియక అందరూ ఎదురుగా కనిపిస్తున్న ఓపీ వద్దకే వెళ్తున్నారు. ఉదయమే భారీసంఖ్యలో బారులు తీరుతున్న రోగులతో ఓపీ విభాగం కిటకిటలాడుతోంది. దీంతో సాధారణ రోగులెవరో, కరోనా బాధితులెవరో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒకరినొకరు తోసుకుంటూ ఓపీ చీటీల కోసం ఎగబడుతుండటంతో వైరస్‌ తేలిగ్గా వ్యాపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Updated Date - 2021-04-17T05:15:37+05:30 IST