బ్యాటరీ మింగిన బాలుడు

ABN , First Publish Date - 2022-08-09T06:21:53+05:30 IST

బటన్‌ బ్యాటరీని మింగిని బాలుడిని జీజీహెచ్‌కి తీసుకు రాగా వైద్యులు దానిని ఎండోస్కోపీ ద్వారా బైటకు తీశారు.

బ్యాటరీ మింగిన బాలుడు

జీజీహెచ్‌లో చికిత్స చేసి బయటకు తీసిన వైద్యులు


గుంటూరు(జీజీహెచ్‌), ఆగస్టు8: బటన్‌ బ్యాటరీని మింగిని బాలుడిని జీజీహెచ్‌కి తీసుకు రాగా వైద్యులు దానిని ఎండోస్కోపీ ద్వారా బైటకు తీశారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన మూడేళ్ల బాలుడు ప్రణీత్‌ ఆడుకుంటూ బటన్‌ బ్యాటరీ మింగాడు. అతనిని తల్లిదండ్రులు సోమవారం జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ డాక్టర్‌ జగన్‌మోహన్‌, సహాయకులు డాక్టర్‌ షేక్‌ నాగూర్‌బాషా పరీక్షలు చేసి ఎండోస్కోపి ద్వారా బటన్‌ బ్యాటరీని తొలగించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ బ్యాటరీని మింగడం వల్ల పేగుల్లో రంద్రాలు పడి ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. దీనిని వెంటనే తీయడం వల్ల బాలుని ప్రాణాలను కాపాడగలిగామన్నారు. గ్యాస్ట్రోఎంట్రాలజి బృందాన్ని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి అభినందించారు. 

Updated Date - 2022-08-09T06:21:53+05:30 IST