పెళ్లాడినందుకు పేడ తినిపించారు... ఇదీ దారుణం!

ABN , First Publish Date - 2020-02-08T14:15:50+05:30 IST

కొంతమంది గ్రామ పెద్దలు చట్టాన్ని, కోర్టులను పట్టించుకోకుండా మూర్ఖంగా తీర్పులను చెప్పేస్తుంటారు. ఇటువంటి ఘటన యూపీలోని బుందేల్‌ఖండ్ పరిధిలోని ఝాన్సీలో చోటుచేసుకుంది.

పెళ్లాడినందుకు పేడ తినిపించారు... ఇదీ దారుణం!

కొంతమంది గ్రామ పెద్దలు చట్టాన్ని, కోర్టులను పట్టించుకోకుండా మూర్ఖంగా తీర్పులను చెప్పేస్తుంటారు. ఇటువంటి ఘటన యూపీలోని బుందేల్‌ఖండ్ పరిధిలోని ఝాన్సీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్వాల్‌టోలీ నివాసి భూపేష్ 2015 జూన్‌లో వేరే కులానికి చెందిన యవతిని వివాహం చేసుకున్నాడు. దీంతో అతని కులానికి చెందిన వారంతా  ఆ దంపతులను సమాజ బహిష్కరణ చేశారు. ఇప్పుడు మరోమారు వీరిని పంచాయతీకి హాజరు కావాలని ఆదేశించారు. ఆ దంపతులు గోమూత్రం తాగి, పేడ తింటేనే సమాజంలో కలిసేందుకు అనుమతి ఇస్తామని పంచాయతీ పెద్దలు తెలిపారు. అయితే తాము అటువంటి పని చేయమని ఆ దంపతులు తెగేసి చెప్పారు. అలాగే  బూపేష్ ఈ ఉదంతంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా పోలీసు అధికారి సంగ్రామ్‌సింగ్ మాట్లాడుతూ చట్టపరంగా పంచాయతీ పెద్దలపై చర్యలు తీసుకుంటామన్నారు. 


Updated Date - 2020-02-08T14:15:50+05:30 IST