‘అధిక ధరలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి’
ABN , First Publish Date - 2022-05-24T06:29:25+05:30 IST
నిత్యావసర సరుకులకు వ్యతరేకంగా ప్రజా పోరాటాలకు సన్నద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి, కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు, రాధాకృష్ణ, వెంకటేశులు పిలుపునిచ్చారు.
ఆదోని, మే 23: నిత్యావసర సరుకులకు
వ్యతరేకంగా ప్రజా పోరాటాలకు సన్నద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి
గౌస్ దేశాయి, కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు, రాధాకృష్ణ,
వెంకటేశులు పిలుపునిచ్చారు. సోమవారం ఆదోని, పత్తికొండ రెవిన్యూ డివిజన్
పరిధిలోని పట్టణ, మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శుల, రాజకీయ శిక్షణ
తరగతులు ఆదోని పట్టణంలో ఈనెల 23, 24వ తేదీ లలో జరుగుతున్నాయన్నారు. ఈ
సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్, ఆర్టీసీ, పెట్రోలు, డీజిల్ వంట
గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు
వీరశేఖర్, లక్ష్మణ్, లింగన్న, మల్లయ్య, తిక్కన్న, రాము డు,
రామాంజనేయులు, నాగరాజు పాల్గొన్నారు.