ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి : జూలకంటి

ABN , First Publish Date - 2021-07-26T07:06:01+05:30 IST

ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి : జూలకంటి
సమావేశంలో మాట్లాడుతున్న జూలకంటి రంగారెడ్డి

మాడ్గులపల్లి, జూలై 25 : ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పార్టీ మండల ద్వితీయ మహాసభలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. నిరుద్యోగం దేశంలో నానాటికి పెరిగిపోతోందన్నారు. కరోనా సమయంలో ప్ర జలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాన్నారు. ఇకనైనా ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోకపోతే ప్రభుత్వాలపై ప్రజలు ఉద్యమిస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డి.మల్లేష్‌, నాయకులు శ్రీకర్‌, అశోక్‌రెడ్డి, శ్రీను, కన్న య్య, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-26T07:06:01+05:30 IST