సీఎంఆర్ఎఫ్తో కొండంత అండ
ABN , First Publish Date - 2022-08-15T05:48:43+05:30 IST
సీఎంఆర్ఎఫ్తో కొండంత అండ
- కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి
కొడంగల్, ఆగస్టు 14 : నిరుపేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండ అని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొడంగల్, బొంరా్సపేట్, దౌల్తాబాద్, కోస్గి, మద్దూర్ మండలాలకు చెందిన 60 బాధిత కుటుంబాలకు రూ.30,98,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
- సీఎం సభను జయప్రదం చేయాలి : ఎమ్మెల్యే
రేపు(మంగళవారం) వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం టీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి నేతలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. బొంరాస్పేట్, దౌల్తాబాద్, మద్దూర్, కోస్గి, కొడంగల్ మండలాల నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లతో సమావేశమయ్యారు. నియోజకరవ్గం నుంచి దాదాపు 15 వేల మంది టీఆర్ఎస్ శ్రేణులు తరలి రావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో ఎంపీపీ ముద్దప్పదేశ్ముఖ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దామోదర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కృష్ణ, వైస్ చైర్మన్ ఉషారాణి, పీఏసీఎస్ చైర్మన్ కట్కం శివకుమార్గుప్త, కౌన్సిలర్ మధుయాదవ్, జీ.రాంరెడ్డి, రమేశ్బాబు, విష్ణువర్ధన్రెడ్డి, కోట్ల యాదగిరి, దేశ్యనాయక్, టి.టి.రాములు, సర్పంచ్లు సయ్యద్ అంజద్, బి.పకీరప్ప, శంకర్నాయక్, చిన్న, నాయకులు టి.సాయిలు, శివకుమార్, కాశప్ప, దత్తురెడ్డి, ఫయిమోద్దీన్, సి.వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.