పయాణికులకు మరింత చేరువవ్వండి: సజ్జనార్‌

ABN , First Publish Date - 2021-12-04T07:51:19+05:30 IST

అనివార్యంగా చార్జీలు పెంచినప్పటికీ ప్రయాణికుల ఆదరణ కోల్పోకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సజ్జనార్‌ అధికారులను ఆదేశించారు.

పయాణికులకు మరింత చేరువవ్వండి: సజ్జనార్‌

హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): అనివార్యంగా చార్జీలు పెంచినప్పటికీ ప్రయాణికుల ఆదరణ కోల్పోకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సజ్జనార్‌ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. శుక్రవారం బస్‌ భవన్‌లో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు, సంస్థ ఉన్నతాధికారులతో చార్జీల పెంపుతో ఉత్పన్నమయ్యే సమస్యలపై సజ్జనార్‌ సమీక్షించారు. అవసరమైన రూట్లలో బస్సులు నడుపుతూ, అవసరంలేని రూట్లలో రద్దు చేసి ఖర్చును తగ్గించుకునే విషయాలపై ఎక్కడిక్కడ నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

Updated Date - 2021-12-04T07:51:19+05:30 IST