మా నోట్లో బూడిద కొట్టొద్దు..
ABN , First Publish Date - 2022-06-24T06:22:41+05:30 IST
నేలటూరులోని శ్రీ దామోదరం సంజీవయ్య(జెన్కో) థర్మల్ విద్యుత్కేంద్రాన్ని ప్రైవేటు పరం చేసి తమ
ముత్తుకూరు, జూన్ 23: నేలటూరులోని శ్రీ దామోదరం సంజీవయ్య(జెన్కో) థర్మల్ విద్యుత్కేంద్రాన్ని ప్రైవేటు పరం చేసి తమ నోట్లో బూడిద కొట్టొద్దని జెన్కో కార్మికులు పేర్కొ న్నారు. థర్మల్ కేంద్రం ఎదుట గురువారం వారు ప్లేట్లలో బూడిదతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తమ జీవనం మెరుగుపడుతుందని స్థానికులు జెన్కో థర్మల్ కేంద్రం కోసం భూములు త్యాగం చేశారన్నారు. ఇచ్చిన హామీలనే ఇప్పటివరకు జెన్కో యాజమాన్యం పూర్తిగా నెరవేర్చలేదన్నారు. ఇప్పుడు థర్మల్ కేంద్రాన్ని ప్రైవేటు పరం చేస్తే తమ పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాల పేరుతో జెన్కోను ప్రైవేటు పరం చేసేందుకు తాము అంగీకరిం చేది లేదని ఈ నిర్ణయం వెనక్కు తీసుకునే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెన్కో కాంట్రాక్టు కార్మికుల ఐక్యవేదిక నాయకులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.