బయట ప్రాంతాల నుంచి వచ్చి డబ్బులు పంచుతున్నారు: గెల్లు శ్రీనివాస్
ABN , First Publish Date - 2021-10-30T22:13:41+05:30 IST
ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ను బీజేపీ నేతలు చెడగొడుతున్నారని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మండిపడ్డారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చి డబ్బులు పంచుతున్నారని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్: ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ను బీజేపీ నేతలు చెడగొడుతున్నారని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మండిపడ్డారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చి డబ్బులు పంచుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల అధికారులకు ఇది కన్పించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. తాము ఎక్కడా డబ్బులు పంచ లేదన్నారు. బీజేపీ కార్యకర్తలు పోలింగ్ బూతుల దగ్గర గొడవలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.