కాఫీ గింజల కొనుగోలుకు జీసీసీ రెడీ

ABN , First Publish Date - 2021-01-27T05:56:09+05:30 IST

గిరిజన సహకార సంస్థ ద్వారా కాఫీ గింజల కొనుగోలుకు అపెక్స్‌ కమిటీ ధరలు ఖరారు చేసిందని పాడేరు, చింతపల్లి డివిజనల్‌ మేనేజర్లు కె.పార్వతమ్మ, సీహెచ్‌ మధు తెలిపారు.

కాఫీ గింజల కొనుగోలుకు జీసీసీ రెడీ

పార్చిమెంట్‌ ధర కిలో రూ.140, చెర్రీ రూ.63



పాడేరు/చింతపల్లి, జనవరి 26: గిరిజన సహకార సంస్థ ద్వారా కాఫీ గింజల కొనుగోలుకు అపెక్స్‌ కమిటీ ధరలు ఖరారు చేసిందని పాడేరు, చింతపల్లి డివిజనల్‌ మేనేజర్లు కె.పార్వతమ్మ, సీహెచ్‌ మధు తెలిపారు. మంగళవారం వారు విలేఖరులతో మాట్లాడుతూ ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా ఆదివాసీలు పండించిన కాఫీ గింజలకు అంతర్జాతీయ ధరలు అందించేందుకు జీసీసీ మార్కెటింగ్‌ ప్రారంభించిందన్నారు. పార్చిమెంట్‌ కిలోకు రూ.140, చెర్రీ, రొబస్ట్రా కిలోకి రూ.63 ధర చెల్లిస్తుందన్నారు. ఈ ధర మొత్తం ఒకే విడతలో రైతుల ఖాతాకు జమ చేస్తుందన్నారు. బుధవారం నుంచి కాఫీ గింజలు సేకరిస్తామన్నారు. ఆదివాసీ రైతులు దళారులకు విక్రయించి నష్టపోకుండా జీసీసీకి విక్రయించాలని వారు కోరారు.

Updated Date - 2021-01-27T05:56:09+05:30 IST