ఆలయాలకు జీసీసీ ఉత్పత్తులు
ABN , First Publish Date - 2022-01-26T04:57:47+05:30 IST
జిల్లాలోని అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖ లింగం ఆలయాలకు జీసీసీ ఉత్పత్తులను అందజే యడానికి ఒప్పందం కుదిరిందని జీసీసీ డివిజనల్ మేనేజర్ సంధ్యారాణి తెలిపారు.
సీతంపేట: జిల్లాలోని అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖ లింగం ఆలయాలకు జీసీసీ ఉత్పత్తులను అందజే యడానికి ఒప్పందం కుదిరిందని జీసీసీ డివిజనల్ మేనేజర్ సంధ్యారాణి తెలిపారు. ఈ మేరకు మంగళవారం అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం ఆలయాల అధికారులకు దేవదాయశాఖ కమిషనర్ పంపించిన ఉత్తర్వులను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ జీసీసీ ద్వారా తయారవు తున్న పసుపు, కారం, చింతపండు, కుంకుమ వంటి నాణ్యమైన ఉత్పత్తులను అందజేస్తామని చెప్పారు. దేవదాయశాఖ కమిషనర్ జీసీసీ ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలను ఇచ్చారని తెలిపారు. కార్య క్రమంలో సీతంపేట మేనేజర్ ఎస్.నరసింహులు తదితరులు పాల్గొన్నారు.