గవర్లను బీసీ-ఏలో చేర్చాలి

ABN , First Publish Date - 2021-10-20T05:27:56+05:30 IST

గవర సామాజికవర్గాన్ని బీసీ-డీ జాబితా నుంచి బీసీ-ఏ జాబితాలోకి మార్చడానికి కృషి చేయాలని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి, గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌లను కోరినట్టు కేంద్ర గౌరీ సంఘం అధ్యక్షుడు ఆడారి అప్పారావు తెలిపారు.

గవర్లను బీసీ-ఏలో చేర్చాలి
దాడి వీరభద్రరావుకి వినతిపత్రం ఇస్తున్న గౌరీ సంఘం నాయకులు

మాజీ మంత్రి ‘దాడి’కి గౌరీ సంఘం నాయకులు వినతి

అనకాపల్లిటౌన్‌, అక్టోబరు 19: గవర సామాజికవర్గాన్ని బీసీ-డీ జాబితా నుంచి బీసీ-ఏ జాబితాలోకి మార్చడానికి కృషి చేయాలని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి, గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌లను కోరినట్టు కేంద్ర గౌరీ సంఘం అధ్యక్షుడు ఆడారి అప్పారావు తెలిపారు. గవర కులస్థుల్లో 90 శాతం మంది అన్ని విధాలా వెనుకబడి వున్నారని, కాయకష్టంతో కుటుంబాలను పోషించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 29న బీసీ కమిషన్‌ విశాఖపట్నం వస్తున్న నేపథ్యంలో గవర సామాజికవర్గం సమస్యలను కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాలని దాడి వీరభద్రరావును కోరినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్‌ అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం అధ్యక్షుడు విల్లూరి పైడారావు, సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:27:56+05:30 IST