జగన్ను చూసి బోరున విలపించిన గౌతమ్రెడ్డి తల్లి
ABN , First Publish Date - 2022-02-21T20:33:09+05:30 IST
మంత్రి గౌతమ్రెడ్డి భౌతికకాయానికి సీఎం జగన్ నివాళులర్పించారు. గౌతమ్రెడ్డి కుటుంబసభ్యులను సీఎం దంపతులు ఓదార్చారు.
హైదరాబాద్: మంత్రి గౌతమ్రెడ్డి భౌతికకాయానికి సీఎం జగన్ నివాళులర్పించారు. గౌతమ్రెడ్డి కుటుంబసభ్యులను సీఎం దంపతులు ఓదార్చారు. గౌతమ్రెడ్డి పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు సీఎం ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చారు. సీఎంను చూసి గౌతమ్రెడ్డి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. జగన్ను పట్టుకుని ఆమె భోరుమన్నారు. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. గౌతమ్రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్రెడ్డిని కూడా జగన్ ఓదార్చారు.
అంతకుముందు గౌతమ్రెడ్డి అకాల మరణం పట్ల జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్రెడ్డి తనకు తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువ నాయకుడుగా పేర్కొన్నారు. ఈ విషాద ఘటనపై జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన యువ మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనంత బాధను కలిగించిదన్నారు. భారమైన హృదయంతో ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని జగన్ తెలియజేశారు.
మేకపాటి గౌతమ్రెడ్డి ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన.. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అత్యవసర చికిత్స అందించినప్పటికీ ప్రాణం నిలబడలేదు. ఆయన మరణించారన్న విషయాన్ని గౌతమ్ భార్యకు అపోలో వైద్యులు సమాచారం ఇచ్చారు. కాగా.. వారం రోజుల పాటు దుబాయ్ పర్యటన ముగించుకొని నిన్న (ఆదివారం నాడు) గౌతమ్ హైదరాబాద్కు వచ్చారు.