క్రికెట్ కంటే సైనికులు ముఖ్యం: గంభీర్
ABN , First Publish Date - 2021-02-27T09:06:43+05:30 IST
సరిహద్దు ఉగ్రవాదానికి స్వస్తి పలికే వరకూ పాకిస్థాన్తో ఎలాంటి సంబంధాలూ ఉండకూడదని ..
న్యూఢిల్లీ: సరిహద్దు ఉగ్రవాదానికి స్వస్తి పలికే వరకూ పాకిస్థాన్తో ఎలాంటి సంబంధాలూ ఉండకూడదని మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ స్పష్టంజేశాడు. ‘మన సైనికుల జీవితాలతో పోలిస్తే క్రికెట్ చాలా చిన్న విషయం. అందువల్ల సరిహద్దు తీవ్రవాదం ముగిసే వరకూ పాకిస్థాన్తో ఎలాంటి సంబంధాలూ నెరపకూడదు’ అని గంభీర్ అన్నాడు.