కన్నులపండువగా గౌరీపరమేశ్వరుల ఉత్సవం
ABN , First Publish Date - 2021-01-24T06:12:49+05:30 IST
వేల్పులవీధి గౌరీపరమేశ్వరుల ఉత్సవం శనివారం కన్నులపండువగా ప్రారంభమైంది. తెల్లవారుజామున ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
వేల్పులవీధిలో ఊరేగింపును ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే
గౌరీపరమేశ్వరులను దర్శించుకున్న ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యే
అనకాపల్లి టౌన్, జనవరి 23: వేల్పులవీధి గౌరీపరమేశ్వరుల ఉత్సవం శనివారం కన్నులపండువగా ప్రారంభమైంది. తెల్లవారుజామున ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఉత్సవ ఊరేగింపును ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. అంతకు ముందు గౌరీపరమేశ్వరులను దర్శించుకున్న అనంతరం వారిని ఉత్సవ కమిటీ సత్కరించింది.
అలాగే ఎమ్మెల్సీలు బుద్ద నాగజగదీశ్వరరావు, పప్పల చలపతిరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడు దాడి రత్నాకర్, పోలీసు అధికారులు గౌరీపరమేశ్వరులను దర్శించుకున్నారు. వీరితో పాటు వైసీపీ నాయకులు మళ్ల బుల్లిబాబు, మందపాటి జానకిరామరాజు, పలకా రవి, గొర్లి సూరిబాబు, జాజుల రమేశ్, టీడీపీ నాయకులు డాక్టర్ కేకేవీఏ నారాయణరావు, బోడి వెంకటరావు, మురళీ, పద్మలత, ప్రసాద్ దర్శించుకున్నారు. ఉత్సవంలో భాగంగా పలు కూడళ్లలో సాంస్కృతిక కార్యక్రమాలు, నేలవేషాలను ఏర్పాటు చేయడంతో యువత కేరింతలు కొట్టింది. డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.