సామాన్యులకు గుది‘బండ’

ABN , First Publish Date - 2021-03-03T04:46:29+05:30 IST

పెట్రో ధరలు భగ్గున మండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే మూడుసార్లు గ్యాస్‌ ధరలు పెరిగాయి. నానాటికీ పెరిగిపోతున్న ధరల తో సామాన్య ప్రజలు ఆర్థిక భా రం భరించలేక ఆందోళన చెం దుతున్నారు

సామాన్యులకు గుది‘బండ’

బద్వేలు, మార్చి2: పెట్రో ధరలు భగ్గున మండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే మూడుసార్లు గ్యాస్‌ ధరలు పెరిగాయి. నానాటికీ పెరిగిపోతున్న ధరల తో సామాన్య ప్రజలు ఆర్థిక భా రం భరించలేక  ఆందోళన చెం దుతున్నారు. పెట్రో ధరల ప్రభా వం నిత్యావసరాలపై పడుతోం ది.  వంటగ్యాస్‌ గృహ వినియోగదారుల పా లిట గుదిబండలాగా మారుతోంది. ఎడా పెడా పెరుగుతున్న గ్యాస్‌ ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గృహ అవసరాలకు సామాన్య ప్రజలు వంటగ్యా్‌సను  వాడేందుకు ఇబ్బందులు పడే పరిస్థితి చోటు చేసుకుంటుంది. గ్యాస్‌ ధరలు పెరుగుతున్నా సబ్సిడీ ధర పెరగకపోవడం ఏమిటో అర్థం కావడం లేదని  పేదలు ఆవేదన చెందుతున్నారు.

గ్యాస్‌ ధరలు తగ్గించాలి

 రోజురోజుకూ  వంట గ్యాస్‌ ధర పెంచుకుతూ పోతున్నారు. దీంతో నిత్యావసర సరుకుల ధరలూ పెరుగుతున్నాయి. ఈ ప రిస్థితుల్లో  ధరలు పెంచడం సరైంది కాదు. తక్షణమే పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించాలి.

మాణిక్యమ్మ, బద్వేలు

 పేదవారికి గుదిబండే 

రోజుకూలికి వెళ్తాం, గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచేశారు. గ్యాస్‌ను కొనలేం. కట్టెల పొయ్యే భవిష్యత్తులో ఆదరవుగా కనిపిస్తోం ది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ప్ర స్తుతం ప్రభుత్వాలు విస్మరించడం దారుణం.

బి.కర్ణమ్మ, బద్వేలు 





Updated Date - 2021-03-03T04:46:29+05:30 IST