గ్యాస్ లీకేజీ ఘటనపై హోంమంత్రి ఆరా
ABN , First Publish Date - 2022-06-03T23:14:14+05:30 IST
విజయవాడ: అనకాపల్లి గ్యాస్ లీకేజీ ఘటనపై హోంమంత్రి తానేటి వనిత ఆరా తీశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలు
విజయవాడ: అనకాపల్లి గ్యాస్ లీకేజీ ఘటనపై హోంమంత్రి తానేటి వనిత ఆరా తీశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్యాస్ పీల్చి ఇబ్బందిపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. లీకేజీని త్వరగా కంట్రోల్లోకి తీసుకోవాలని ఆదేశించారు.