గ్యాస్ లీకై వ్యక్తి సజీవ దహనం
ABN , First Publish Date - 2022-08-16T04:35:02+05:30 IST
ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశా త్తూ నిప్పంటుకుని అల్లూరు నరసింహులు(46) సజీవ దహన మయ్యాడు.
కలసపాడు, ఆగస్టు 15: ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశా త్తూ నిప్పంటుకుని అల్లూరు నరసింహులు(46) సజీవ దహన మయ్యాడు. శంకవరం వాసి నరసింహులు సజీవ దహనమ య్యాడు. ఈయన భార్య ఇటీవల మరణించింది. వారం నుంచి ఆరోగ్యం బాగా లేకపోయినా పదేళ్ల కుమారుడికి వంట చేసిపెడుతుండగా గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో నిలువునా కాలిపోయాడు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ నాగమురళీ పరిశీలించి బంధువుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.