గ్యాస్‌ లీకై తాటాకిల్లు దగ్ధం

ABN , First Publish Date - 2020-10-19T06:07:28+05:30 IST

ఎటపాక, అక్టోబరు 18: ఎటపాక మండలం కృష్ణవరం పంచాయతీలోని చింతలచెరువు గిరిజన గ్రామంలో శనివారం రాత్రి ప్రమాదవశాత్తూ వంట గ్యాస్‌ లీకై తాటాకిల్లు దగ్ధమైంది.

గ్యాస్‌ లీకై తాటాకిల్లు దగ్ధం
కాలిపోయిన ఇళ్లు

రూ. 3.50 లక్షల మేర ఆస్తి నష్టం
ఎటపాక, అక్టోబరు 18: ఎటపాక మండలం కృష్ణవరం పంచాయతీలోని చింతలచెరువు గిరిజన గ్రామంలో శనివారం రాత్రి ప్రమాదవశాత్తూ వంట గ్యాస్‌ లీకై తాటాకిల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన సోడే సావిత్రి గ్యాస్‌పై వంట చేసి బయటకు వెళ్లింది. ఈ క్రమంలో వంట గ్యాస్‌ లీకై ఇంటికి అంటుకుంది. స్థానికులు గమనించి మంటలను అదుపుచేసే లోపే నష్టం జరిగిపోయింది. ఇంట్లో బీరువాలోని మూడుకాసుల బంగారపు తాడు, రూ.25 వేల నగదు, వెండి పట్టీలు, ఫ్రిజ్‌, బీరువా, గృహోపరకణాలు పూర్తిగా కాలిపోయాయి. ఆధార్‌, స్టడీకి సంబంధించిన సర్టిఫికెట్లు సైతం దగ్ధమయ్యాయి. మొత్తం రూ.3 లక్షల 50వేల వరకు ఆస్తినష్టం జరిగినట్టు తహశీల్దార్‌ సీహెచ్‌ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ రాంబాబు నష్టాన్ని అంచనా వేశారు. బాధిత కుటుంబానికి  25 కిలోల బియ్యం పంపిణీ చేశారు.
కట్టమూరులో...
పెద్దాపురం, అక్టోబరు 18: మండలంలోని కట్టమూరు రాజుగారి బీడు ప్రాంతంలో విద్యుత్‌ షార్టు సర్క్యూట్‌ అయ్యి తాటాకిల్లు దగ్ధమైంది. రూ.లక్ష మేర ఆస్తినష్టం సంభవించింది. కట్టా వెంకటలక్ష్మీ, కట్టా గణే్‌షకు చెందిన ఇల్లు ప్రమాదానికి గురికావడంతో గృహోపరకరణాలు, బట్టలు కాలి బూడిదయ్యాయి. ఏడీఎ్‌ఫవో పేరూరి శ్రీనివాస్‌ సిబ్బందితో మంటలు అదుపుచేశారు.

Updated Date - 2020-10-19T06:07:28+05:30 IST