కలిసికట్టుగా వచ్చి.. రహదారి నిర్మించి

ABN , First Publish Date - 2020-08-03T19:13:57+05:30 IST

ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని చూడలేదు ఆ గ్రామానికి చెందిన యువకులు..

కలిసికట్టుగా వచ్చి.. రహదారి నిర్మించి

గరుగుబిల్లి(విజయనగరం): ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని చూడలేదు ఆ గ్రామానికి చెందిన యువకులు. వారే కొంత మొ త్తాలను పోగుచేసుకొ ని రహదారిని నిర్మించుకు న్నారు. వివరాల్లోకి వెళ్తే మరుపెంట పంచాయతీ మధుర సాంబన్నవలస రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు అధ్వానంగా తయారైంది. దీంతో ఈ మార్గం గుండా రాకపోకలు సాగించాలంటే ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆదివారం గ్రామానికి చెందిన యువత కలిసికట్టుగా సుమారు 3 కిలోమీటర్లకు పైగా రహదారిని మెరుగుప ర్చుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు చెప్పినా స్పందన లేకపోవడంతో తమకు తామే స్పందించి సమస్యను పరిష్కరించుకున్నారు. యువత చొరవతో రహదారికి మోక్షం కలగడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-08-03T19:13:57+05:30 IST