16న గరుడ వారధి ప్రారంభం.. హాజరుకానున్న CM Jagan!
ABN , First Publish Date - 2022-02-11T12:29:07+05:30 IST
తిరుపతిలో తొలి దశలో పూర్తయిన గరుడ వారధి (శ్రీనివాస సేతు) అందుబాటులోకి రానుంది.
తిరుపతి : తిరుపతిలో తొలి దశలో పూర్తయిన గరుడ వారధి (శ్రీనివాస సేతు) అందుబాటులోకి రానుంది. ఈనెల 16న సీఎం జగన్ ఈ వారధిని ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలద్వారా తెలిసింది. ఆర్టీసీ బస్టాండు సమీపంలోని శ్రీనివాసం సర్కిల్ నుంచి అలిపిరి పోలీస్ స్టేషన్ వరకు వారధి నిర్మాణం పూర్తయింది. శరవేగంగా తుది మెరుగులు దిద్దుకుంటోంది. మరో వారంలో వారధి అందుబాటులోకి రానుండడంతో తిరుపతిలో ట్రాఫిక్ కష్టాలు కొంతవరకు తీరినట్టువుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.