నేడు ‘గరిమెళ్ల’ జయంతి

ABN , First Publish Date - 2020-07-15T09:41:00+05:30 IST

స్వాతంత్ర్యోద్యమ గేయకవి, మాకొద్దీ తెల్లదొరతనమంటూ గళమెత్తిన గరిమెళ్ల సత్యనారాయణ జయంతి ..

నేడు ‘గరిమెళ్ల’ జయంతి

ప్రియాగ్రహారం(పోలాకి), జూలై 14: స్వాతంత్ర్యోద్యమ గేయకవి, మాకొద్దీ తెల్లదొరతనమంటూ గళమెత్తిన గరిమెళ్ల సత్యనారాయణ జయంతి కార్యక్రమం బుధవారం  ప్రియాగ్రహారంలో నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ నాయకులు కేఏఎన్‌.భుక్త, బాడాన రాజు, లావేటి కృష్ణ, ఇలపండ గణపతిరావు తెలిపారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అలాగే ఇటీవల మృతి చెందిన గరిమెళ్ల మేనల్లుడు వేదుల సుబ్బారావు సంస్మరణ సభను కూడా ఏర్పాటు చేశామన్నారు. కరోనా నిబంధనల మేరకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని, సాహితీప్రియులు, అభిమానులు హాజరుకావాలని కోరారు.

Updated Date - 2020-07-15T09:41:00+05:30 IST