నాలుగు చోట్ల గార్బేజ్ ట్రాన్సఫర్ స్టేషన్లు
ABN , First Publish Date - 2021-05-18T05:26:40+05:30 IST
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో నాగులు చోట్ల గార్బేజ్ ట్రాన్సఫర్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు కమిషనర్ వర్మ తెలిపారు. ఈ మేరకు సోమవారం కరోనా నియంత్రణ చర్యలు, 15వ ఆర్థిక సంఘ నిధులతో చేప ట్టవలసిన పనులపై తన చాంబర్లో ఇంజిరింగ్ అధికారులతో సమీక్షించారు.
రింగురోడ్డు : విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో నాగులు చోట్ల గార్బేజ్ ట్రాన్సఫర్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు కమిషనర్ వర్మ తెలిపారు. ఈ మేరకు సోమవారం కరోనా నియంత్రణ చర్యలు, 15వ ఆర్థిక సంఘ నిధులతో చేప ట్టవలసిన పనులపై తన చాంబర్లో ఇంజిరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కరోనా రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇందులో భాగంగా ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని క్లాప్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, తద్వారా చెత్తరహిత నగరంగా తీర్చిదిదాకదలన్నారు. నగరానికి నాలుగు గార్బేజ్ ట్రాన్సఫర్ స్టేష న్లు మంజూరయ్యాయని, వీటిని 15వ ఆర్థిక సంఘ నిధులతో పనులు చేపట్ట నున్నట్టు తెలిపారు. వేసవి దృష్టా తాగునీటి సమస్య లేకుండా చూడాల్సిన బాధ్య త మనపై ఉందన్నారు. ముఖ్యంగా కేఎల్ పురం, ధర్మపురి, బీసీ కాలనీ ప్రాంతాల్లో అత్యావసరంగా తాగునీటి పంపిణీకి చర్యలు చేపట్టాలన్నారు. సమీక్షలు ఈఈ కిలాన్ దిలీప్, డీఈలు నర్సింగరావు, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.