గంటిపల్లిపాలెంలో ఘర్షణ
ABN , First Publish Date - 2021-04-17T05:49:13+05:30 IST
గంటి పల్లిపాలెం గ్రామంలో గురువారం రాత్రి జరిగిన ఘర్షణలో ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్టు ఎస్ఐ ఎల్.శ్రీనునాయక్ తెలిపారు.
ఇరు వర్గాలపై కేసుల నమోదు
కొత్తపేట, ఏప్రిల్ 16: గంటి పల్లిపాలెం గ్రామంలో గురువారం రాత్రి జరిగిన ఘర్షణలో ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్టు ఎస్ఐ ఎల్.శ్రీనునాయక్ తెలిపారు. వివరాలు ఇలా వున్నాయి... గంటి పల్లిపాలేనికి చెందిన చీకరుమిల్లి రవికుమార్ తన మరదలు పుట్టినరోజు వేడుకల్లో ఉండగా కాగిత రాముడు, సుందరరెడ్డి, సత్యారెడ్డి, పంతగాని శామ్యూల్, నేరేడుమిల్లి అభిలాష్, చింతా ఫణికుమార్, రాజ్కుమార్, మహేష్, రొక్కాల విజయకుమార్ర్లు వచ్చి టీడీపీకి మద్దతు ఇస్తున్నారన్న కక్షతో దాడి చేశారు. దీనిపై రవికుమార్ ఫిర్యాదు చేశాడు. తన అన్న సత్యారెడ్డిని చంపుతామని చీకరుమిల్లి వెంకట్, పల్లి రాజశేఖర్, చీకురుమిల్లి దానియేలు, నక్కా నాగేశ్వరరావు, బద్దే కిషోర్, సరిపెల్ల ప్రదీప్, పమ్మి సురేష్, చీకరుమిల్లి రవికుమార్ బెదిరించడంతో పాటు దాడిచేశారని కాగిత నీలిమాసుందరరెడ్డి ఫిర్యాదు చేశాడు. తాను అడ్డుకోబోతే గెంటివేసినట్టు అందులో పేర్కొన్నారు. వీటిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.