ఈ సారి గంటాపై.. విజయసాయి తీవ్రవ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-07-15T18:34:19+05:30 IST

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావును ఉద్దేశిస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి

ఈ సారి గంటాపై.. విజయసాయి తీవ్రవ్యాఖ్యలు

ఇంటర్నెట్ డెస్క్: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావును ఉద్దేశిస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సైకిళ్ల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆరోపించారు. రూ.12 కోట్ల కొనుగోళ్లలో రూ.5కోట్ల అవినీతి జరిగిందన్నారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్నే చెబుతూ.. తుప్పు సైకిళ్ళపై గంటా శీను ఘనఘనా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 12 కోట్ల కొనుగోళ్ళలో 5 కోట్ల అవినీతి జరిగింది..  ఎస్‌కే బైక్స్ నుంచి కొనవద్దని బ్లాక్ లిస్టు చేసినా.. బ్లాక్ మనీ కోసం తెగ తొక్కేశాడని ఫిర్యాదుల వెల్లువెత్తాయని ఆరోపించారు.  ఈ ట్వీట్‌ను వైసీపీ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. 



Updated Date - 2020-07-15T18:34:19+05:30 IST