రేపు వైసీపీలోకి గంటా కుమారుడు!

ABN , First Publish Date - 2020-10-02T08:22:43+05:30 IST

టీడీపీ ఎమ్మెల్యేలను కాకుండా వారి వారసులను వైసీపీలో చేర్చుకునే ప్రక్రియ కొనసాగుతోంది. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (విశాఖ ఉత్తర) కుమారుడు రవితేజ.. తన తండ్రి సమక్షంలోనే శనివారం వైసీపీలో చేరనున్నారు...

రేపు వైసీపీలోకి గంటా కుమారుడు!

అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేలను కాకుండా వారి వారసులను వైసీపీలో చేర్చుకునే ప్రక్రియ కొనసాగుతోంది. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (విశాఖ ఉత్తర) కుమారుడు రవితేజ.. తన తండ్రి సమక్షంలోనే శనివారం వైసీపీలో చేరనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రవితేజకు సీఎం జగన్మోహన్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. కాగా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల గంటాపై ట్విటర్‌లో ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు హయాంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి జరిగిందని.. దానికి మూల్యం చెల్లించుకుంటారని పేర్కొన్నారు. ఇప్పుడు వైసీపీలోకి గంటాను ఆహ్వానించడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. ఈ కార్యక్రమానికి విజయసాయిరెడ్డి హాజరవుతారా లేదా అనే చర్చ జరుగుతోంది.

Updated Date - 2020-10-02T08:22:43+05:30 IST