భైంసాలో ప్రారంభమైన గణపతుల శోభాయాత్ర

ABN , First Publish Date - 2021-09-19T01:45:28+05:30 IST

నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో శనివారం మధ్యాహ్నం గణపతుల నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. నవరాత్రులు మండపాల్లో

భైంసాలో ప్రారంభమైన గణపతుల శోభాయాత్ర

భైంసా: నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో శనివారం మధ్యాహ్నం గణపతుల నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. నవరాత్రులు మండపాల్లో పూజలందుకున్న గణనాథులకు భైంసా పట్టణ వాసులు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. భక్తుల కోలాహలం మధ్య వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవం ఆధ్యంతం వైభవోపేతంగా కొనసాగుతోంది. శోభాయమానంగా అలంకరించిన వాహనాలపై వినాయక విగ్రహాలకు నిమజ్జనానికి తరలించారు. గడ్డెన్న వాగు ప్రాజెక్టుతో పాటు ఇతర చెరువులలో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. అయితే, భైంసాలో నిమజ్జనం సందర్భంగా పోలీసులు డ్రోన్‌ కెమెరాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర కొనసాగే మార్గంలో భారీగా బలగాలను మొహరించారు. పట్టణంలో 134 చోట్ల గణపతుల ప్రతిమలను ప్రతిష్ఠించగా.. ప్రతీ మండపం వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-09-19T01:45:28+05:30 IST