టీడీపీకి పెరుగుతున్న ఆదరణ : గన్ని
ABN , First Publish Date - 2022-05-21T06:13:36+05:30 IST
టీడీపీకి ఆదరణ పెరుగుతోం దని పార్టీ అధినేత చంద్రబాబునా యుడు నిర్వహిస్తున్న సమావే శాలకు వస్తున్న ప్రజలే నిదర్శనమని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజ నేయులు అన్నారు
ఏలూరు టూటౌన్, మే 20: టీడీపీకి ఆదరణ పెరుగుతోం దని పార్టీ అధినేత చంద్రబాబునా యుడు నిర్వహిస్తున్న సమావే శాలకు వస్తున్న ప్రజలే నిదర్శనమని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజ నేయులు అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో మినీ మహానాడు నిమిత్తం జరుగుతున్న నిర్మాణ పనులను శుక్రవారం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహానాడు పురస్కరించుకుని ప్రతీ ఆసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారీ సభలు నిర్వహిస్తామని సమావేశాలకు చంద్రబాబు నాయుడు హాజరయ్యే అవకాశాలున్నాయని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. పార్టీ జిల్లా కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్, పార్టీ నాయకులు బెజ్జం రాజేష్ పుత్ర, పెడ్డిబోయిన శివప్రసాద్, కంప్యూటర్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.