Gannavaram : కొన ఊపిరితో రైలు పట్టాలపై మహిళ.. కాపాడిన పోలీసులు
ABN , First Publish Date - 2021-08-10T18:10:58+05:30 IST
గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. గన్నవరం రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై రక్తపు మడుగులో గుర్తు తెలియని మహిళ కొన ఊపిరితో కొట్టుమిట్టులాడుతుంది. రక్తం మడుగులో పడి ఉన్న
కృష్ణా : జిల్లాలోని గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. గన్నవరం రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై రక్తపు మడుగులో గుర్తు తెలియని మహిళ కొన ఊపిరితో కొట్టుమిట్టులాడుతూ కనిపించింది. ఈ విషయాన్ని రాత్రిపూట పెట్రోల్మెన్గా వ్యక్తి గురించి పోలీసులకు అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన మహిళను 108 అంబులెన్స్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.