గంజి ప్రసాద్ హత్య కేసులో 10 మందిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-05-01T16:16:24+05:30 IST

గంజి ప్రసాద్ హత్య కేసులో 10 మందిపై కేసు నమోదు

గంజి ప్రసాద్ హత్య కేసులో 10 మందిపై కేసు నమోదు

ఏలూరు: గంజి ప్రసాద్ హత్య కేసులో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 120బి, 302 ఐపీసీ సెక్షన్ల కింద సురేష్, హేమంత్, మోహన్, నాగార్జున,బజారయ్య, భానుప్రకాశ్ రెడ్డి, సత్యనారాయణపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఉన్నారు. 


ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంజి ప్రసాద్‌ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు వల్లే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చనిపోయిన గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేదుకు వెళ్లిన గోపాలపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తులు దాడికి దిగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆయనపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు రక్షణ వలయంగా ఏర్పడి ఆయన్ను సురక్షితంగా తరలించిన విషయం తెలిసిందే

Updated Date - 2022-05-01T16:16:24+05:30 IST