గంజాయి విక్రయిస్తున్న నలుగురి అరెస్ట్
ABN , First Publish Date - 2020-11-24T06:20:48+05:30 IST
నార్కట్పల్లి, చిట్యాల మండలాల్లో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి మూడున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
నార్కట్పల్లి/చిట్యాల నవంబరు 23: నార్కట్పల్లి, చిట్యాల మండలాల్లో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి మూడున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నార్కట్పల్లి సీఐ శంకర్రెడ్డి తెలిపి వివరాల ప్రకారం.. నార్కట్పల్లికి చెందిన షేక్ ఉమర్, అక్కెనపల్లికి చెందిన షేక్ షరీఫ్లు నార్కట్పల్లిలోని నల్లగొండ ఫ్లైవోర్ కింద అనుమానాస్పదంగా కనిపించగా పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. నిందితుల నుంచి రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి కేజీ రూ.1500కు కొనుగోలు చేసి స్థానికంగా విక్రయిస్తున్నట్లు నిందితులు అంగీకరించారని సీఐ తెలిపారు. చిట్యాలకు చెందిన నర్సింహ, నార్కట్పల్లికి చెందిన లింగస్వామి చిట్యాల బస్టాండ్లో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి కేజీన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చిట్యాల ఎస్ఐ నాగరాజు తెలిపారు. హైదరాబాద్ ధూల్పేట్లో గంజాయి కోనుగోలు చేసినట్లు నిందితులు అంగీకరించారన్నారు. నింది తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.