30 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-08-11T06:03:46+05:30 IST

నర్సిపట్నం ఏజెన్సీ ఏరియా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న 30 కిలోల గంజాయిని హయత్‌నగర్‌ పోలీసులు పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌ రింగు రోడ్డు

30 కిలోల గంజాయి పట్టివేత

హయత్‌నగర్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): నర్సిపట్నం ఏజెన్సీ ఏరియా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న 30 కిలోల గంజాయిని హయత్‌నగర్‌ పోలీసులు పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌ రింగు రోడ్డు వద్ద పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.6 లక్షలకు పైనే ఉంటుంది. విశ్వసనీయ సమాచారంతో హయత్‌నగర్‌ పోలీసులు బుధవారం పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌ రింగు రోడ్డు వద్ద మాటువేశారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక ఆటోలో సుమారు 30 కిలోల గంజాయి బ్యాగులను తీసుకుని వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆటోను సీజ్‌ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నర్సిపట్నం ఏజెన్సీ ఏరియా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2022-08-11T06:03:46+05:30 IST