17 కిలోల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2021-03-01T05:43:05+05:30 IST

కర్నూలు పంచలింగాల చెక్‌పోస్టులో ఎస్‌ఈబీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు.

17 కిలోల గంజాయి స్వాధీనం

కర్నూలు, ఫిబ్రవరి 28: కర్నూలు పంచలింగాల చెక్‌పోస్టులో ఎస్‌ఈబీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. ఎస్‌ఈబీ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపిన వివరాలివి.. ఎస్పీ ఫక్కీరప్ప, అడిషనల్‌ ఎస్పీ గౌతమిశాలి ఆదేశాల మేరకు ఆదివారం పంచలింగాల చెక్‌పోస్టులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాదు నుంచి కర్నూలు మీదుగా బెంగళూరు వెళ్తున్న టీఎ్‌సఆర్‌టీసీ వోల్వో ప్లస్‌ బస్సును ఆపి తనిఖీ చేయగా, ఆ బస్సులో గుర్తు తెలియని వ్యక్తులు బస్సులో గంజాయి వదిలేసి వెళ్లారని.. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు సీఐ తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్లు  సీఐ తెలిపారు.

Updated Date - 2021-03-01T05:43:05+05:30 IST