820 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2020-11-30T06:40:24+05:30 IST

మండలంలోని గోకులపాడు హైవే జంక్షన్‌ వద్ద ఎస్‌ఐ చక్రధర్‌ ఆదివారం భారీగా గం జాయిని పట్టుకున్నారు.

820 కిలోల గంజాయి పట్టివేత
స్వాధీనపర్చుకున్న గంజాయి ప్యాకెట్ల తో ఎస్‌ఐ చక్రధర్‌, సిబ్బంది

  లారీలో తరలిస్తుండగా గుర్తించిన పోలీసులు

 యూపీకి చెందిన ఇద్దరు నిందితుల అరెస్టు

ఎస్‌.రాయవరం, నవంబరు 29 : మండలంలోని గోకులపాడు హైవే జంక్షన్‌ వద్ద ఎస్‌ఐ చక్రధర్‌ ఆదివారం భారీగా గం జాయిని పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు గోకులపాడు హైవే వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఇంతలో అటుగా వస్తున్న ఓ లారీలో 820 కిలోల గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.16 లక్షలు ఉంటుందని ఎస్‌ఐ చెప్పారు. లారీని సీజ్‌ చేసి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీతల్‌ప్రసాద్‌, గయాదిన్‌లను అరెస్టు చేశామన్నారు. 

Updated Date - 2020-11-30T06:40:24+05:30 IST