కెప్టెన్సీ నుంచి కోహ్లీని అందుకే తొలగించాం.. పెదవి విప్పిన గంగూలీ

ABN , First Publish Date - 2021-12-10T02:54:36+05:30 IST

టీమిండియా వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీని తొలగించడంపై దుమారం రేగుతుండడంతో బీసీసీఐ బాస్ సౌరవ్..

కెప్టెన్సీ నుంచి కోహ్లీని అందుకే తొలగించాం.. పెదవి విప్పిన గంగూలీ

ముంబై: టీమిండియా వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీని తొలగించడంపై దుమారం రేగుతుండడంతో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ఎట్టకేలకు పెదవి విప్పాడు. వైట్‌బాల్ ఫార్మాట్‌కు ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదని సెలక్టర్లు భావించారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నాడు.


టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోహ్లీని కోరినప్పటికీ టీ20 ప్రపంచకప్ తర్వాత కొనసాగేందుకు అతడు అంగీకరించలేదని గంగూలీ గుర్తు చేశాడు. కాబట్టి రెండు రెండు వైట్‌బాల్ ఫార్మాట్లకు ఇద్దరు వైట్ బాల్ కెప్టెన్లు అవసరం లేదని సెలక్టర్లు భావించారని గంగూలీ వివరించాడు. 


పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పలువురు కెప్టెన్లు ఉండడం వల్ల గందరగోళానికి దారితీస్తుందని గంగూలీ పేర్కొన్నాడు. అందుకనే.. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వన్డే, టీ20 జట్లు రెండింటికీ రోహిత్‌నే కెప్టెన్‌గా నియమించిందన్నాడు. అయితే, ఆ గందరగోళం ఏంటన్నది కానీ, అలా అని వారు ఎందుకు అనుకున్నారో కానీ తనకు తెలియదని గంగూలీ తేల్చి చెప్పాడు.  

Updated Date - 2021-12-10T02:54:36+05:30 IST