మద్దెలచెరువు సూరి తమ్ముడు గంగుల సుధీర్ రెడ్డి ఇలాంటి పనులు చేయిస్తున్నారు: సునీత

ABN , First Publish Date - 2020-06-03T20:15:07+05:30 IST

రాప్తాడు నియోజకవర్గంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. గతంలో చేసిన అభివృద్ధిని ఓర్వలేకే శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారని

మద్దెలచెరువు సూరి తమ్ముడు గంగుల సుధీర్ రెడ్డి ఇలాంటి పనులు చేయిస్తున్నారు: సునీత

అనంతపురం: రాప్తాడు నియోజకవర్గంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. గతంలో చేసిన అభివృద్ధిని ఓర్వలేకే శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారని దుయ్యబట్టారు. శిలాఫలకాల ధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని ఆరోపించారు. మద్దెలచెరువు సూరి తమ్ముడు గంగుల సుధీర్ రెడ్డి ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలో పేరూరు డ్యామ్‌కు రూ.804 కోట్లు కేటాయించామని సునీత తెలిపారు.

Updated Date - 2020-06-03T20:15:07+05:30 IST