’ఆత్మనిర్భర్‌ భారత్‌’ కాగితాల్లోనే ఉంది: గంగుల కమలాకర్‌

ABN , First Publish Date - 2021-10-11T03:21:13+05:30 IST

బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకం కాగితాలకే పరిమితమయిందని మంత్రి గంగుల కమలాకర్‌ విమర్శించారు.

’ఆత్మనిర్భర్‌ భారత్‌’ కాగితాల్లోనే ఉంది: గంగుల కమలాకర్‌

హుజూరాబాద్‌: బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకం కాగితాలకే పరిమితమయిందని మంత్రి గంగుల కమలాకర్‌ విమర్శించారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు మద్దతుగా మంత్రి గంగుల కమాలాకర్‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మనిర్భర్‌ భారత్‌తో చిరు వ్యాపారులకు లాభం చేస్తామని చెప్పిన బీజేపీ వారికి ఏ విధంగా ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదన్నారు. ఈటల రాజేందర్‌ నిర్లక్ష్యంతో హుజూరాబాద్‌ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మాణం కాలేదని చెప్పారు. త్వరలోనే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. చిరు వ్యాపారుల కోసం హుజూరాబాద్‌లో కచ్చితంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పనితనం చేతల్లో చూపించే సర్కార్‌ టీఆర్‌ఎస్‌ అని, మాటలతో కోటలు కట్టే పార్టీ బీజేపీ అన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, అన్ని వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయని  గంగుల కమలాకర్‌ చెప్పారు.

Updated Date - 2021-10-11T03:21:13+05:30 IST