ప్రజల కోసం చేస్తాం.. బీజేపీ చెబితే చేయం: మంత్రి గంగుల

ABN , First Publish Date - 2021-11-05T21:28:06+05:30 IST

అన్ని పథకాల్లాగే దళిత బంధు అమలు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారున. దళిత బంధు ఎప్పటి నుంచి ఇవ్వాలనేదానిపై సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

ప్రజల కోసం చేస్తాం.. బీజేపీ చెబితే చేయం: మంత్రి గంగుల

హైదరాబాద్: అన్ని పథకాల్లాగే దళిత బంధు అమలు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారున. దళిత బంధు ఎప్పటి నుంచి ఇవ్వాలనేదానిపై సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. దళిత బంధు ఇవ్వాలని బీజేపీ అడగలేదన్నారు. మమ్మల్ని అడగడానికి బీజేపీ ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. దళిత బంధు, రైతు బంధు బీజేపీ చెప్తే ఇవ్వడం లేదు కదా? అని అన్నారు. ఏదైనా ప్రజల కోసం చేస్తాం.. బీజేపీ చెబితే చేయమన్నారు. 


Updated Date - 2021-11-05T21:28:06+05:30 IST