గంగిరెడ్డిపాలెంలో బాదుడే బాదుడు
ABN , First Publish Date - 2022-05-19T02:55:22+05:30 IST
మండలంలోని గంగిరెడ్డిపాలెంలో బుధవారం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని సర్పంచు సూరేపల్లి మాధవ ఆధ్వర్యంలో నిర్వ
కలిగిరి, మే 18: మండలంలోని గంగిరెడ్డిపాలెంలో బుధవారం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని సర్పంచు సూరేపల్లి మాధవ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకుడు మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత పెరిగిన ధరలతో సామాన్యుడి బతుకు అగమ్యగోచరమైందన్నారు. అనంతరం కరపత్రాలను ఇంటింటికి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కొండారెడ్డి, నాగరాజు, ఇంద్రసేనారెడ్డి, మహేష్, వెంగపనాయుడు, వరప్రసాద్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
గన్నేపల్లి పంచాయతీలో..
ఉదయగిరి రూరల్, మే 18: వైసీపీ ప్రభుత్వం మూడేళ్లల్లో నిత్యావసర వస్తువుల ధరలను ఇష్టానుసారంగా పెంచి ప్రజలపై అధిక భారం మోపిందని టీడీపీ మండల కన్వీనర్ సీహెచ్. బయ్యన్న తెలిపారు. బుధవారం మండలంలోని గన్నేపల్లి పంచాయతీలోని గ్రామాల్లో బాదుడేబాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొజ్జా నరసింహులు, గడ్డం వెంకటేశ్వర్లు, హుస్సేనయ్య, పిచ్చయ్య, ఆర్మ్స్ట్రాంగ్రాజు, ఖాన్సా, మరియదాసు తదితరులు పాల్గొన్నారు.